భీమిని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద గుర్తుతెలియని దుండగులు అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్, సీసీ కెమెరాలను చోరీ చేశారు. టవర్ ఎక్కి సుమారు 60 వేల విలువైన కాపర్ వైర్ ను ఎత్తుకెళ్లడంతో మండల కేంద్రంలో సేవలు నిలిచిపోయాయి. సంస్థ ప్రతినిధి ప్రకాష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.