బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుడు కానుకూరు రామచందర్, ఎన్టీవీ రిపోర్టర్ రమేష్ను ఫోన్లో పరుష పదాలతో దుషించి, కబ్జాలపై వార్తలు రాస్తే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులను ప్రస్తావించి హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. జర్నలిస్టు సంఘాలు ఈ చర్యను ఖండించి, నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.