కన్నేపల్లి మండలంలోని ముత్తాపూర్ గ్రామంలో శుక్రవారం నూతన రేషన్ దుకాణాన్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, ఆత్మ కమిటీ చైర్మన్ ఓడ్డెటి హనుమంతులు ప్రారంభించారు. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకమని వారు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదలను సంతోష పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.