నెన్నెల మండలంలోని గుండ్ల సోమవారం గ్రామంలో సోమవారం, అక్క దుర్గం హేమలతపై ఆమె చెల్లెళ్లు స్వర్ణలత, సౌజన్యలు దాడి చేశారు. ఈ దాడిలో హేమలతకు గాయాలయ్యాయి. దీంతో ఆమె నెన్నెల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్వర్ణలత, సౌజన్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.