
మేఘాలయలో బొగ్గుగని పేలుడు.. నలుగురు కూలీల మృతి
మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో గురువారం ఒక అక్రమ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించగా, ఒకరు గాయపడ్డారు. థాంగ్స్కు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని కోరారు. 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) మేఘాలయలో రాట్-హోల్ బొగ్గు తవ్వకంపై నిషేధం విధించింది. అయితే అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అనుమానిస్తున్నారు.




