తాండూర్ మండలం చౌటపల్లికి వెళ్లే దారిలో అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలలో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్రోచ్ రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.