
2040లో చందమామపైకి భారత వ్యోమగామి: ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి ఇస్రో (ISRO) చీఫ్ వీ నారాయణన్ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వెల్లడించారు. 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) తయారీ లక్ష్యాలుగా పెట్టుకున్నారు. 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెడతారని, 2027లో మానవసహిత అంతరిక్షయాత్ర మిషన్ ట్రాక్లో ఉందని తెలిపారు.




