సింగరేణి యాజమాన్యం ప్రకటించిన లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం జరిగిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియాలోని శాంతిఖనిగని ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల కారుణ్య నియామకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.