మధుకర్ మృతికి కారణమైన వారిని 48 గంటల్లోగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండే సంజయ్ డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు, కాంగ్రెస్ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మధుకర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.