సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, హెల్త్ కార్డులు, గైర్హాజరు వంటి అంశాలపై చెన్నూరు లో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమంలో ఆలస్యం, అలసత్వం వహించరాదని, జీరో పెండెన్సీ సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎస్.ఈ.ఐ.ఈ.డి కిరణ్ కుమార్, గనుల డిపార్ట్మెంట్ల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.