జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద విధుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ అలవూరి అనురాగ్ ను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ, అనురాగ్ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.