కోటపల్లి మండలంలోని లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా ధాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ధాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ గురువారం తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.