మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జైలు నుంచి విడుదలయ్యాక తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లపై దుశ్శాసనపర్వం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లను ఎక్కడపడితే అక్కడ ముట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఈ గొడవకు వారే ప్రేరేపించి, ఎన్నికల వాయిదాకు కుట్ర చేశారని ఆయన విమర్శించారు.