మందమర్రి మండలం సన్రోన్ పల్లి గ్రామంలో రైతులకు యాసంగి వరి పొలాల్లో ట్రాక్టర్ ద్వారా నడిచే కేజీ వీల్స్ వాడకంపై వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి అవగాహన కల్పించారు. కేజీ వీల్స్ వాడటం వల్ల భూమి పైపొర ఎక్కువ సేకరించబడి, నీరు, ఎరువులు ఎక్కువ లోతుకు వెళ్లి పంటకు అందవని ఆయన తెలిపారు. అందువల్ల వరి పంటలో దమ్ము చేయడానికి కేజీ వీల్స్ ఉపయోగించవద్దని సూచించారు.