మందమర్రి ఏరియాలోని సింగరేణి వాహనాలపై సంస్థ జీ. ఎం (ఈ&ఎం) ట్రాన్స్పోర్ట్ రామనాదం, జిఎం కార్యాలయ ఆవరణలో జిఎం రాధాకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, సంస్థ సొంత వాహనాల రకం, ఆర్టీఏ ఫిట్నెస్, ఇన్సూరెన్స్, వాటి ప్రస్తుత కండిషన్, కేటాయింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, తుక్కు కింద తొలగించాల్సిన వాహనాల వివరాలను కూడా సంబంధిత అధికారుల నుంచి సేకరించారు.