మందమర్రిలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్, శేఖర్ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ, చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీ రాజ్యాధికారం సాకారమవుతుందని వారు తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం సంఘం పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.