గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓటు చోరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఆయన అన్నారు.