మార్గశిర ఏకాదశి సందర్భంగా రామకృష్ణాపూర్ లోని మురళి కృష్ణ దేవాలయంలో దయానంద గిరి గీత భక్త సమాజం ఆధ్వర్యంలో 32వ గీత యజ్ఞం జరిగింది. గీత ప్రచారకులు ఇల్లంపాటి రాఘవేంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భక్తజనం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రెండవ రోజు సోమవారం యజ్ఞం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.