మంగళవారం రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 తో పూర్వ వైభవం వస్తుందని మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. రేపు జరగబోయే ఓపెన్ కాస్ట్ ప్రజా సేకరణ సమావేశ ఏర్పాట్లను ఆయన సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.