శుక్రవారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతూ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగి భారతదేశ చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.