భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ అల్లరి మూకలు దాడి చేశాయి. కార్యాలయంలోని జెండా గద్దెను ధ్వంసం చేసి, భవనంపై దాడి చేశారు. కాంగ్రెస్ గుండాలు పక్కా ప్రణాళికతో ఫ్లెక్సీలు చింపి, ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్లు సమాచారం.