దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన శాతరాజు ఆశయ్యకు చెందిన ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆశయ్య తన రెండు ఆవులను తీసుకొని మేత కోసం తీసుకెళ్లాడు. మేతమేస్తుండగా ఆవు కరెంట్ పోలుకు తగిలి పొలంలో పడిపోయింది. మృతి చెందిన ఆవు విలువ 80 వేల వరకు ఉంటుందని రైతు గురువారం వాపోయాడు. స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.