రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన కోటి విలువైన గంజాయిని కోర్టు అనుమతితో ధ్వంసం చేసినట్లు సీపీ అంబర్ కిషోర్ జూ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న ఈ గంజాయిని న్యాయాధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. 53 కేసుల్లో ఎఫ్ఎస్ఎల్ పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు.