తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. 2008 అక్టోబర్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఈ స్తూపానికి శంకుస్థాపన చేయగా, 2014 జూన్ 2న తెలంగాణ అమరుల కుటుంబాలు దీనిని ఆవిష్కరించారు. ఈ స్తూపం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేస్తుందని నాటి ఉద్యమకారులు తెలిపారు.