AP: మద్వి హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా ఆదివారం భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని.. ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్కౌంటర్గా చెప్పుకున్నారని ఆరోపించారు. కాగా, ఎన్కౌంటర్ను వ్యతిరేస్తూ మావోయిస్టులు పెద్దఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు.