మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా పలువురు మావోల ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఆదివారం దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. బస్తర్ డివిజన్లోని 7 జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేషనల్ పార్క్, పామేడు, అబూజ్మడ్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పోలీసులు భద్రతను పెంచారు. దాడులు జరగవచ్చనే అనుమానంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.