AP: ఎన్కౌంటర్లు పెరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు లొంగిపొమ్మని సూచిస్తూ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ‘కగార్’, తెలంగాణలో లొంగుబాట్లతో మావోయిస్టులు ఏపీలో షెల్టర్ తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నారని తెలిపారు. ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చన్నారు. 2026 మార్చి 26 లోపు లొంగితే రివార్డు, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డెడ్లైన్ దాటితే ఎన్కౌంటర్ తప్పదని హెచ్చరించారు.