దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువన ట్రేడవుతోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 271 పాయింట్లు కుంగి 80,099 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు తగ్గి 24,378 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది.