యూపీలోని జలౌన్ జిల్లాలోని కొంచ్ కొత్వాలి ప్రాంతంలో మంగళవారం నేహా ప్రజాపతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటి వంటగదిలో ఉరి వేసుకున్న ఆమె, సూసైడ్ నోట్లో తన అక్క మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించింది. మార్చి 14న వివాహం చేసుకోబోతున్న నేహా, ఇటీవల క్యాన్సర్తో మరణించిన తన తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి మరణానికి అక్కే కారణమని, ఆమె పెళ్లి కోసం తండ్రిని ఇబ్బంది పెట్టడం వల్లే చికిత్సపై శ్రద్ధ చూపలేకపోయారని నేహా భావించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.