తెలంగాణలో
జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు నేతలు ఆ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాజా సుజాత ఆధ్వర్యంలో
జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ రామ్ తాళ్లూరి.. పార్టీలో చేరిన వారికి
జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక నుంచి
జనసేన బలోపేతం కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు.