TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హుస్నాబాద్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నుండి పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అయిలేని అనితారెడ్డి కూడా ఉన్నారు. మంత్రులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.