ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ టెండర్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.