ఫ్రాన్స్లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. దొంగలు అమూల్య రత్నాలను దొంగిలించి పారిపోయారు. ఈ ఘటనతో పర్యాటకులు, మ్యూజియం అధికారులు షాక్కు గురయ్యారు. ఫ్రెంచ్ పోలీసులు దోపిడీపై దర్యాప్తు ప్రారంభించారు. భద్రత కారణంగా మ్యూజియం తాత్కాలికంగా మూసివేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు.