ఆసియా కప్లో టీమిండియా అన్ని మ్యాచ్లు ఆడుతుందని.. అది పాకిస్థాన్తో అయినా సరే తలపడుతుందని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పష్టం చేశాడు. "ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బీసీసీఐ ఇప్పటికే తేల్చేసింది. కాబట్టి మా దృష్టంతా ఆదివారం జరుగబోయే మ్యాచ్ మీదే ఉంది. ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉత్కంఠగానే సాగుతుంది" అని సితాన్షు వెల్లడించాడు.