
గజ్వేల్ లో పోలీసుల కవాతు: ఎన్నికల ప్రశాంత వాతావరణం కోసం పిలుపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో గురువారం గజ్వేల్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ సీఐ రవికుమార్, ముత్యం రాజు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ ఉన్నత అధికారుల సూచనల మేరకు గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సామరస్యంగా, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎన్నికల సమయంలో గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ, పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని కోరారు.






































