మెదక్ జిల్లా తూప్రాన్లో 2019లో జరిగిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు అర్కెల నాగేశ్కు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఈ తీర్పు సమాజానికి గట్టి హెచ్చరిక అని ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు తెలిపారు.