మెదక్లో శిశువుల విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రూ. 1.50 లక్షలకు శిశువును విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. మొదట శిశువు మృతి చెందినట్లు చెప్పి, తర్వాత అమ్మిన విషయం వెలుగులోకి రావడంతో అధికారులు ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.