మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ మెదక్ స్టేడియం నుంచి చిన్న శంకరంపేట్ మండలంలోని కొర్విపల్లి వరకు సాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అరుణార్తి వెంకటరమణ, పరశురాం గౌడ్ తో పాటు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.