ఏడుపాయల వనదుర్గా అమ్మవారి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిరస వాతావరణాన్ని సృష్టించారు. వేద మంత్రోచ్చారణల మధ్య పల్లకిని శివాలయం వరకు ఊరేగించారు. ఆలయ ప్రాంగణం దీపాలతో అలంకరించబడగా, కార్తీక దీపాల వెలుగులతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది.