నిజాంపేట మండలంలో యూరియా పంపిణీని పూర్తిగా యాప్ ద్వారా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. మండలానికి వచ్చిన 1000 యూరియా బస్తాలలో 200 బస్తాలను రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని వెల్లడించారు. యాప్ బుకింగ్తో పారదర్శకత పెరిగి రైతులకు సమయానికి ఎరువులు అందుతాయని పేర్కొంటూ, రైతులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.