మెదక్: నాడు కేసీఆర్‌ తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు

64చూసినవారు
మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దీక్షా దివస్ పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతోనే నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని జ్ఞాప్తికి తెచ్చారు.

సంబంధిత పోస్ట్