మెదక్ పట్టణ అభివృద్ధిలో భాగంగా జర్నలిస్టు కాలనీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పరిసర ప్రాంతాల్లో రూ. 1.60 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రోహిత్ రావు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.