మెదక్ జిల్లా బాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం మంజీరా నది వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి.