అల్లాదుర్గంలో వాహనదారులు, యువతకు సైబర్ నేరాలపై ఎస్సై శంకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయ ప్రకటనలు, అనుమానాస్పద లింకులను నమ్మి నగదు లావాదేవీలు చేయవద్దని సూచించారు. తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా డబ్బులు అడిగితే స్పందించవద్దని, ఫేక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది.