మెదక్: రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసిన ఎంపీ

4చూసినవారు
మెదక్: రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసిన ఎంపీ
మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గ రైల్వే ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్