మెదక్: రాష్ట్రస్థాయిలో పీఎంశ్రీ కూచన్ పల్లి విద్యార్థుల ప్రతిభ

0చూసినవారు
మెదక్: రాష్ట్రస్థాయిలో పీఎంశ్రీ కూచన్ పల్లి విద్యార్థుల ప్రతిభ
రెంజుకీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పీఎంశ్రీ కూచన్‌పల్లి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. కరాటే మాస్టర్ నాగేశ్వర్ శిక్షణలో మవ్య శ్రీ, అభినయ, బృహతి, నందినితో సహా మొత్తం 14 మంది బాలికలు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుమోహన్ తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగా విద్యార్థులు పొందిన శిక్షణ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని, ఈ ఘనతపై పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.