వెల్దుర్తిలో నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించి, జిల్లాలోని గ్రంథాలయాల పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, పాఠకులకు మెరుగైన సేవలు అందించే మార్గాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రంథాలయాలను కేవలం పుస్తకాల నిలయాలుగా కాకుండా
విద్యార్థులు, యువతకు విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.