మాసాయిపేటలోని 44వ జాతీయ రహదారిపై ఒక ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. మెదక్లో రిపేర్ చేయించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. అదృష్టవశాత్తు, డ్రైవర్ మరియు క్లీనర్ సకాలంలో బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బస్సు కాలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.