నర్సాపూర్ పట్టణంలోని 8వ వార్డులో రూ. 30 లక్షల వ్యయంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పుర ఛైర్పర్సన్ లక్ష్మి,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, వార్డువాసులు పాల్గొన్నారు.