మెదక్ జిల్లా నర్సాపూర్లో గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న పల్నాటి పెద్దిరాజు అనే చేపల వాహన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం క్యాన్సర్ నిర్ధారణ అయిన అతడు, చికిత్స పొందుతున్నా తీవ్ర నొప్పులు, ఆరోగ్య సమస్యలతో మనోవేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.